కొత్తగా వచ్చిన మున్సిపల్ చట్టం ప్రజలకు భరోసా ఇస్తుందని తెలంగాణ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారందరికీ ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లుతెలిపారు. 6 నెలల్లో సదాశివపేటలో నీటి సమస్యలేకుండా చూస్తామని తెలిపారు. మున్సిపల్ చట్టంతో పారద్శకత పెరుగుతుందన్నారు.
75 గజాలలోపు ఇల్లు కట్టాలంటే రూపాయి ఫీజు కడితే చాలన్నారు. అదే 250 గంజాలలోపు ఇల్లు కడితే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే చాలన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతి మున్సిపాలిటీకి ఉన్నతాధికారిని నియమించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు.