telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హరీశ్ రావు మౌనం మంచిది కాదు: అశ్వత్థామరెడ్డి

ashwathama reddy

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విపక్షాలతో పాటు కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. సమ్మె నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ హరీశ్ రావు మౌనంగా ఉండటం మంచిది కాదని అన్నారు. మంత్రి మౌనం వీడాలని, ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు నోటితో నవ్వి, నొసటితో వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయని చెప్పారు. మేము చెప్పిన విషయాల్లో తప్పుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెబుతామని అన్నారు. తనకు అక్రమ ఆస్తులు ఉన్నట్టు తేలితే బహిరంగ ఉరిశిక్షకు కూడా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.

Related posts