నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కు కవిత తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు టీఆర్ఎస్ నేతలు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ వేసిన కవితకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఆయనతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.