తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాబినెట్ విస్తరణపై టీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపీట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రాజ్భవన్లో కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు హాజారయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబడిన 10మందికి తన అభినందనలు తెలిపారు. తనకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై ఆయన స్పందిస్తూ టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిలాంటి కార్యకర్తనన్నారు.
కేసీఆర్ ఏది ఆదేశిస్తే దాన్ని తు.చ తప్పకుండా పాటిస్తానని పేర్కొన్నారు. .ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాలు, సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్ ను ఏర్పాటు చేశారు. ఆయన నాకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు. నాకు ఎలాంటి అసంతృప్తీ లేదని తెలిపారు. తన పేరిట ఎటువంటి సోషల్ మీడియా గ్రూప్ లు లేవని, ఒకవేళ ఎవరైనా అలా క్రియేట్ చేసుంటే, వాటిని తొలగించాలని కోరారు. ఎవరైనా కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేయాల్సిందేనని ఆయన చెప్పారు.