telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హామీలను నెరవేర్చే దిశగా పని చేద్దాం: హరీశ్‌ రావు

Ryathu bandhu amount Rs. 10000 in future

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని చేద్దామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు మాజీ మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. ఎన్నికలు ముగియడంతో కార్యకర్తల బాధ్యత తీరి, ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రారంభమైందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ఇక ప్రతిరోజు ఓ పండగే అని వ్యాఖ్యానించారు.

భువనగిరిలో రోడ్‌ రోలర్‌ గుర్తు వల్ల టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోయిందన్నారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష వల్లే తాను మరోసారి పార్లమెంట్‌కు వెళున్నాననిఅన్నారు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరన్నారు. హరీశ్‌ రావు నిర్దేశంలో పకడ్బందీగా ప్రచారం చేశామని, ప్రతి కార్యకర్త టీమ్‌ లీడర్‌లా పనిచేశారని ప్రశంసించారు.

Related posts