యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 17న అడిలైడ్లో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ లో తలపడనుంది భారత జట్టు. అయితే ఈ టెస్టుకు స్పిన్నర్ గా రవీంద్ర జడేజా లేదా రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకుంటారని… కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోరని ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. అయితే కుల్దీప్ తమ మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కు వ్యతిరేకంగా 5 వికెట్లు సాధించాడు. ఆ సమయంలో విదేశీ పిచ్లలో టెస్ట్ జట్టుకు కుల్దీప్ ఉత్తమ ఎంపిక. అందుకే విదేశీ టెస్టుల్లో కుల్దీప్ మా మొదటి స్పిన్నర్గా ఉంటాడు అని టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నాడు. కానీ 2019 ప్రపంచ కప్ తర్వాత కుల్దీప్ అంతగా రాణించలేదు. ఐపీఎల్ 2020 ల్లో ఎక్కువ మ్యాచ్ లు ఆడలేదు. కాబట్టి ఇప్పుడు మొదటి టెస్ట్ లోకి జడేజా లేదా అశ్విన్ ను తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. కానీ కుల్దీప్ విషయంలో రవిశాస్త్రి తన మాట నిలబెట్టుకుంటాడా… అని హర్భజన్ సింగ్ అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
కొంత సమయం తర్వాత వైసీపీ పాలనపై స్పందిస్తా: పవన్