telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో ఇవాళ్టి నుంచే ఒంటి పూట బడులు

కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజు రోజు కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. అటు ఎండలు కూడా దంచికొడుతున్నాయి. ఇల్లు దాటి కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణల విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యాసంస్థలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత భోజనం యథావిధిగా ఉంటుందని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు లాభం చేకూరనుంది.

Related posts