telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నేటి నుంచే తెలంగాణలో టీచర్లకు ఒంటిపూట బడులు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయులు ఒంటి పూట విధులు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉపాధ్యాయులు విధుల్లో ఉండాలని పాఠశాల డైరెక్టర్‌ శ్రీదేవసేన ఈ మేరకు వెల్లడించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు మూసివేసినప్పటికీ, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి ఆన్‌లైన్‌ పాఠాలు పర్యవేక్షించాలని సూచించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఆదేశాలతో ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయులకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. కాగా.. ఏపీలో ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే.  

Related posts