telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వైసీపీ, టీడీపీ లకు సవాల్ విసిరిన జీవీఎల్…

వైసీపీ, తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. 1999లో బీజేపీ అభ్యర్థిగా గెలిచాం… బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మరే ప్రభుత్వంలో జరగలేదన్నారు.. ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగిందన్న ఆయన.. తిరుపతిని రూ.2 వేల కోట్ల నిధులతో బీజేపీ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తోందన్నారు.. టీడీపీ, వైసీపీ మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తిరుపతి పార్లమెంటును విస్మరించారని ఆరోపించిన జీవీఎల్.. తిరుపతిలో అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని వైసీపీ, టీడీపికి ఛాలెంజ్ చేశారు.  ఇక, ప్రజలను మభ్యపెట్టి, బెదిరింపులతో, డబ్బులతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ జీవీఎల్… చదువుకున్న అనుభవమున్న మాజీ ఐఏఎస్ రత్నప్రభను భారతీయ జనతా పార్టీ నిలబెట్టిందన్న ఆయన.. ఆమెను గెలిపించిన పార్లమెంట్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts