telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

నీట్ లో .. గురుకులానికి ర్యాంకుల పంట..

gurukulam with good ranks in neet 2019

గౌలిదొడ్డి గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు నీట్‌ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ర్యాంకుల పంట పండించారు. పాఠశాల నుంచి మొత్తం 120మంది విద్యార్థులు నీట్‌ పరీక్ష రాయగా 48ఎంబీబీఎస్‌, 39 బీడీఎస్‌ సీట్లు సాధించేందుకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ శారద తెలిపారు. గతంలో కన్న గొప్పగా ఫలితాలు రావడంతో విద్యార్థులు, అధ్యాపకుల్లో నూతన ఉత్సాహం వచ్చిందని ఈ పేర్కొన్నారు.

గురుకులంలోనే నీట్‌ కోచింగ్‌ 2015 నుండి ఇస్తున్నారు. అందువలనే ఏయేటికాయేడు ర్యాంకులు పెరుగుతూ మంచి ఫలితాలతో విద్యార్థులు దూసుకు పోతున్నారు. గత సంవత్సరం 27ఎంబీబీఎస్‌, 11బీడీఎస్‌ సీట్లు సాధిస్తే ఈ సంవత్సరం మరింత మెరుగైన ర్యాంకులను సాధించారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యాబోధన వల్లే ఈ ఫలితాలు సాధిస్తున్నామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ ఫలితాలతో విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.

Related posts