పాకిస్థాన్ దేశంలో ఎంతో చారిత్రక కట్టడం గురునానక్ ప్యాలెస్ను దుండగులు ధ్వంసం చేశారు. ఆ అద్భుత కట్టడాన్ని వీక్షించేందుకు ప్రతి ఏడాది వేలాది మంది సిక్కు పర్యాటకులు అక్కడకు వెళ్లేవారు. గురునానక్ భవనంలో ఉన్న విలువైన కిటికీలు, డోర్లను అమ్ముకున్నట్లు కూడా తెలుస్తోంది. లాహోర్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌరోల్ పట్టణంలో ఆ భవనం ఉన్నది.
ఆ ప్యాలెస్లో సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్తో పాటు కొందరు హిందూ రాజుల చిత్రాపటాలు ఉన్నాయి. దాదాపు నాలుగు శతాబ్ధాల క్రితం ఆ భవంతిని నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్యాలెస్లో సుమారు 16 భారీ సైజున్న రూమ్లు ఉన్నాయి. ప్యాలెస్ ధ్వంసం చేయడం పై అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అమరావతి నేల నిర్మాణాలకు అనుకూలం కాదు: విజయసాయిరెడ్డి