వరంగల్ నగర మేయర్గా గుండా ప్రకాశ్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు ప్రకాశ్రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకాశ్రావును అభినందించారు.
అనంతరం ప్రకాశ్రావు మాట్లాడుతూ.. తన అభ్యర్థిత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ నగరాన్ని టూరిజం హబ్గా మార్చడం కోసం పాటుపడతానని స్పష్టం చేశారు. వరంగల్ నగర మేయర్ స్థానాన్ని దక్కించుకోవడాని కొద్ది నెలలుగా ఆశావహులు అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేశారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన మేరకు అందరు ఐక్యతారాగం వినిపించారు.. దీంతో మేయర్ ఎన్నిక ఏకపక్షంగా కొనసాగింది.
పారదర్శక పాలన అందించేందుకు జగన్ కృషి