రణ్వీర్ సింగ్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “గల్లీ బాయ్”. దేశీ ర్యాప్ కల్చర్ సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ మ్యూజికల్ డ్రామా ప్రేమికుల రోజు సందర్భంగా గత గురువారం విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్వీర్ పాత్ర రాప్ సింగర్, గల్లీ బాయ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే “గల్లీబాయ్” చిత్రాన్ని టాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడానికి చెయ్యనున్నారని, అందులో మెగా ఫ్యామిలీ హీరోలు ఈ రీమేక్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో “చిత్ర లహరి” చిత్రం షూటింగులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బిజీగా ఉన్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. మరోపక్క ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ “గల్లీ బాయ్” తెలుగు రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుని, వైష్ణవ్ తేజ్ తో తెరపైకి తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే.
previous post
next post