telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

హైదరాబాద్ లో మరో మోసం.. గ్రీన్‌గోల్డ్‌ సంస్థ ఎండీ శ్రీకాంత్‌ అరెస్ట్‌

హైదరాబాద్  నగరంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఉప్పల్‌లోని గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌ ఆఫీస్‌ ఎదుట గురువారం బాధితులు ఆందోళనకు దిగారు. వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామంటూ నమ్మించి వేలాది మంది నుంచి గ్రీన్‌గోల్డ్‌ సంస్థ రూ.100 కోట్లకుపైగా మోసానికి పాల్పడింది. 
కోట్ల రూపాయాలు వసూలు చేసిన గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో కూడా శ్రీకాంత్‌పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడులో మోసాలకు పాల్పడినట్లు సమాచారం. బాధితుల్లో అధికంగా కర్ణాటక వాసులు ఉన్నారు. ఈ మోసంపై ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం బహిర్గతమైంది.

Related posts