కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భద్రతా దళాలపై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్నాగ్లోని డిప్యూటీ కమిషనర్స్ ఆఫీసు ముందు ఉగ్రవాదులు గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో సుమారు 10 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ ట్రాఫిక్ పోలీసు, జర్నలిస్టు ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం కేవలం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటన పట్ల విచారణ మొదలుపెట్టారు. ఉగ్రవాదులు పోలీసు ఆఫీసును టార్గెట్ చేసినా.. గ్రేనేడ్ రోడ్డుపై పేలింది.ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఎవరూ ప్రకటించలేదు.
ప్రతి అక్రమకట్టడాన్ని కూలగొడితే స్వాగతిస్తాం: అఖిలప్రియ