telugu navyamedia
రాజకీయ వార్తలు

క‌శ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. గ్రేనేడ్ దాడిలో 10 మందికి గాయాలు

18 soldier died in jammu kashmir bomb blast

క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌ర్వాత భ‌ద్ర‌తా ద‌ళాల‌పై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌లోని డిప్యూటీ క‌మిష‌న‌ర్స్ ఆఫీసు ముందు ఉగ్రవాదులు గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో సుమారు 10 మంది గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ‌వారిలో ఓ ట్రాఫిక్ పోలీసు, జ‌ర్న‌లిస్టు ఉన్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం కేవ‌లం స్వ‌ల్ప గాయాలైన‌ట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ మొద‌లుపెట్టారు. ఉగ్ర‌వాదులు పోలీసు ఆఫీసును టార్గెట్ చేసినా.. గ్రేనేడ్ రోడ్డుపై పేలింది.ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దాడికి బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్లు ఎవ‌రూ ప్ర‌క‌టించ‌లేదు.

Related posts