అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దీవిని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలపై గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రి సోరెన్ ఎస్పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎవరికీ అమ్ముడు పోయేందుకు సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు. తమ దీవిని కొనుగోలుచేసేందుకు ట్రంప్ సిద్ధపడుతున్నట్లు వచ్చిన వార్తలునిజమే అయితే ఆయన పిచ్చివాడనేందుకు ఇది అంతిమ నిదర్శనమని ఆయన అన్నారు.
ట్రంప్ కొనుగోలు వార్తపై స్పందించిన డెన్మార్క్ మాజీ ప్రధాని లోక్కె రాస్ముసెన్ ‘ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ లాంటిదయి వుంటుంది. ఇది పూర్తి అసందర్బమైనది’ అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. డెన్మార్క్ తన దేశానికి చెందిన 50 వేల మంది పౌరులను అమ్మివేస్తుందన్న ఆలోచనే హాస్యాస్పదంగా వుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణం: బీహార్ పీసీసీ