రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకువచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ హీరో, సూపర్ స్టార్ కృష్ణ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో కృష్ణ గారు మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి పై బాధ్యత ఉందని అన్నారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని అతను చేస్తున్న కృషికి నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది తెలిపారు. నా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.