హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారానికి తెరపడింది.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచారపర్వం ముగిసింది… ఇప్పటి వరకు మాటల మధ్య ఆరోపణలు, విమర్శలకు ఫులిస్టాప్ పడింది.. సవాల్లు, ప్రతిసవాళ్లు, మైకుల హోరు… నినాదాలు జోరుకు బ్రేక్ పడిపోగా… ఇక, సైలెంట్గా తమ పని చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు అభ్యర్థులు.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డబ్బులు పంచుతూ.. వివిధ పార్టీలకు చెందిన నేతలు పట్టుబడ్డారు. ప్రచార పర్వానికి తెరపడినా… ప్రలోభాల పర్వానికి మాత్రం ఇప్పుడే తెరలేచిందని చెప్పవచ్చు.. పోలింగ్ ఎల్లుండి జరగనుండగా.. రేపు ఒకేరోజు సమయం ఉంది.. దీంతో.. వీలైనంత ఎక్కువమంది ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడిపోయారు అభ్యర్థులు. మరోవైపు.. డిసెంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది… అంటే, సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటువేసే అవకాశం ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే.
previous post
ప్రతి అక్రమకట్టడాన్ని కూలగొడితే స్వాగతిస్తాం: అఖిలప్రియ