telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : హౌజ్ మేట్స్ కు సర్ప్రైజ్… 10 మంది గెస్టులతో సందడి

Bigg-Boss-3

ఎన్నో అంచనాలతో జూలై 22న ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 3కు ఈ ఆదివారం (నవంబర్‌ 3న) శుభం కార్డు పడనుంది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగుతున్న ‘బిగ్‌’ రియాల్టీ షో ఇది. 17 మంది సభ్యులు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే గ‌త‌వారం శివ‌జ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లు ఉండ‌వు. శ్రీముఖి, బాబా భాస్క‌ర్‌, అలీరెజా, రాహుల్‌, వ‌రుణ్ సందేశ్‌లు ఫైన‌ల్‌కు చేరుకున్నారు. వీళ్లలో ఒకరికి మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకొనే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవ‌ర‌నే దానిపై ప్ర‌స్తుతం హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. అయితే గ్రాండ్ ఫినాలేకు రెండు రోజుల ముందు హౌస్‌మేట్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పాత సభ్యులందరినీ ఇంట్లోకి పంపించారు. రవి, జాఫర్, అషు, రోహిణి, తమన్నా, పునర్నవి, వితిక, శివజ్యోతి, హిమజ, హేమ హౌస్‌లోకి వెళ్లి తమ మిత్రులను కలిశారు. ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించి ప్రొమోను స్టార్ మా విడుదల చేసింది. రవి వచ్చిన వెంటనే అలీ, రాహుల్‌ను కలిశాడు. జాఫర్.. బాబా భాస్కర్‌ను హగ్ చేసుకున్నాడు. అషు, రోహిణి వెళ్లి శ్రీముఖిని కౌగిలించుకున్నారు. ఇక పునర్నవైతే శ్రీముఖిపైకి ఎగిరి హగ్ చేసుకుంది. వితిక నేరుగా భర్త వరుణ్‌ వద్దకు వెళ్లగా.. శివజ్యోతేమో అలీని, రాహుల్‌ను కలిసింది. హేమ కాళ్లు మొక్కేందుకు శ్రీముఖి ప్రయత్నించగా.. వద్దమ్మా తల్లీ అంటూ సున్నితంగా తిరస్కరించింది. హేమక్క తోపు అని రాహుల్ సిప్లిగంజ్ అరవడంతో ఇంట్లో నవ్వులు పూశాయి. ఐతే బిగ్ బాస్ రీయూనియన్‌కు మహేష్ విట్టా, శిల్పా చక్రవర్తి మాత్రం హాజరుకానట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.

Related posts