telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్రామ వాలంటీర్లు తప్పు చేస్తే వెంటనే తొలగిస్తాం: సుభాష్ చంద్రబోస్

pilli subhash chandra bose ycp

గ్రామ వాలంటీర్లు తప్పు చేస్తే వెంటనే తొలగిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ జెడ్పీహాల్ లో గ్రామ వాలంటీర్లకు మాస్టర్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మ భూమి కమిటీలలా కాకుండా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లు వ్యవహరించాలని సూచించారు. తప్పు చేస్తే వెంటనే తొలగించి కొత్త వారిని నియమిస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. 

Related posts