telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ భవనాలకు కొత్త హంగులు..రూపురేఖలు మారనున్న భవనాలు.. సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు

YCP padma comments Chandrababu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేరుతో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం అక్టోబర్‌ 2 నుంచి అందుబాటులోకి రానున్నదని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి అవసరమైన ఆదేశాలను పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ కలెక్టర్‌లకు ఇచ్చారు.

గ్రామ సచివాలయాల పేరుతో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన జగన్‌ ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా సచివాలయ భవనాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులైన గ్రీన్‌, సియాన్‌, తెలుపు హంగులతో తీర్చిదిద్దుతున్నారు.పంచాయతీ భవనాలకు కూడా ఇదే విధమైన రంగులతో కొత్త హంగులు దిద్దాలని అధికారులు ఆదేశించారు.

Related posts