telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెండో విడుత పంచాయతీ పోలింగ్ ప్రారంభం

Gram Panchayat elections Poling started

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు రెండో విడుత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటవర మాత్రమే జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా వార్డుస్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌స్థానాల ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా ఏర్పాట్లు చేసింది.

ఈ విడుతలో 4,135 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతోపాటు, కోర్టు కేసుల నేపథ్యంలో ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. ఈ విడుతలో మొత్తం 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,342 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 10,668 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు.

Related posts