పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఢిల్లీ – శ్రీనగర్, శ్రీనగర్ - జమ్మూ మార్గాల్లో సీఆర్పీఎఫ్ సిబ్బంది విమానాల్లో వచ్చి వెళ్లే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతాలకు కేవలం అధికారులకు మాత్రమే విమాన ప్రయాణ సౌకర్యం ఉండేది. సైనిక సిబ్బంది సెలవుపై వెళ్లేందుకు, తిరిగి విధుల్లోకి వచ్చేందుకు విమాన ప్రయాణ సౌకర్యం పొందనున్నారు.
తాజా నిర్ణయంతో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు సహా సీఆర్పీఎఫ్లోని 7 లక్షల 80 వేల మంది లబ్ధి పొందనున్నారు.
కాగా కేంద్ర పారామిలటరీ బలగాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రయాణ సౌకర్యాలకు అదనంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రమంగా ఈ సౌకర్యాన్ని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది.
స్టాలిన్ షాక్ తో కేసీఆర్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్: విజయశాంతి