telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భార్యతో సహా జిమ్ బ్యాక్ డోర్ నుంచి వెళ్లిపోయిన షాహిద్ కపూర్

shahidkapoor

కరోనా వైరస్ ప్రభలకుండా ఉండేందుకు మహరాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని విద్యాసంస్థలు, కమ్యూనిటీ హాళ్లు, థియేటర్లు, జిమ్‌లను మూసివేయించింది. అయితే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ బాంద్రాలోని యాంటీ గ్రావిట్ క్లబ్‌లోని జిమ్‌ను తెరిపించి, రెండు గంటలపాటు అందులో గడిపారు. ఈ సమయంలో ఆయన భార్య మీరా కూడా ఉన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జిమ్‌ను పూర్తిస్థాయిలో బంద్ చేశాక, సాయంత్రం 5 గంటలకు షాహిద్ కపూర్ దానిని తెరిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారం మీడియాకు తెలిసిన నేపధ్యంలో ఆ హీరో భార్యతో సహా జిమ్ బ్యాక్ డోర్ నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జిమ్ యజమాని జయసింగ్ మాట్లాడుతూ షాహిద్ కపూర్ తనకు స్నేహితుడని, అతను ఇక్కడికి వర్క్ అవుట్ చేయడానికి రాలేదని, తనతో మాట్లాడేందుకు మాత్రమే వచ్చారన్నారు.

Related posts