కరోనా వైరస్ ప్రభలకుండా ఉండేందుకు మహరాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని విద్యాసంస్థలు, కమ్యూనిటీ హాళ్లు, థియేటర్లు, జిమ్లను మూసివేయించింది. అయితే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ బాంద్రాలోని యాంటీ గ్రావిట్ క్లబ్లోని జిమ్ను తెరిపించి, రెండు గంటలపాటు అందులో గడిపారు. ఈ సమయంలో ఆయన భార్య మీరా కూడా ఉన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జిమ్ను పూర్తిస్థాయిలో బంద్ చేశాక, సాయంత్రం 5 గంటలకు షాహిద్ కపూర్ దానిని తెరిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారం మీడియాకు తెలిసిన నేపధ్యంలో ఆ హీరో భార్యతో సహా జిమ్ బ్యాక్ డోర్ నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జిమ్ యజమాని జయసింగ్ మాట్లాడుతూ షాహిద్ కపూర్ తనకు స్నేహితుడని, అతను ఇక్కడికి వర్క్ అవుట్ చేయడానికి రాలేదని, తనతో మాట్లాడేందుకు మాత్రమే వచ్చారన్నారు.