telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

తీసుకున్న లంచం ఇచ్చేస్తూ … దొరికిపోయిన తహసీల్దార్ …

Arrest

లంచం తీసుకున్న తహసీల్దార్ అది తిరిగి ఇస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. హైదరాబాదు శివారు నిజాంపేట పరిధిలో జరిగిందీ ఘటన. బి.శ్రీనివాసరావు అనే బిల్డర్ గత నెల 31న సర్వేయర్ ద్వారా స్కెచ్ కోసం బాచుపల్లి తహసీల్దార్ యాదగిరిని ఆశ్రయించాడు. స్కెచ్ ఇచ్చేందుకు ఆయన లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో శ్రీనివాసరావు తొలి విడతగా రూ.50 వేలు ఇచ్చాడు. ఎంతకీ పనికాకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా తహసీల్దార్‌పై శ్రీనివాసరావు ఒత్తిడి తీసుకొచ్చాడు.

దీంతో గత నెల 14న తహసీల్దార్ యాదగిరి తన డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ సయ్యద్ ద్వారా శ్రీనివాసరావుకు రూ.40 వేలు పంపించి.. మిగతా పది వేల రూపాయలను ఖర్చుకింద తీసుకున్నట్టు చెప్పాడు. రూ.10 వేలు తగ్గించి ఇవ్వడంతో తట్టుకోలేపోయిన బిల్డర్.. ఆయనపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతడు సమర్పించిన ఆధారాలతో తహసీల్దార్ యాదగిరి, అతడి వ్యక్తిగత డ్రైవర్ అబ్దుల్ సయ్యద్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన స్వస్థలమైన దుబ్బాకలో ఉంటున్న యాదగిరి సోదరి ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు.

Related posts