జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారిక ట్విటర్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. గవర్నర్ ఖాతాలోకి చొరబడిన హ్యాకర్లు… ట్విటర్లో ఆయనను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్గా చూపించారు. దీంతో వెంటనే ఆయన అకౌంట్కు అవసరమైన మార్పులు చేసినట్టు రాజ్భవన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ను అన్ఫాలో చేసినట్టు తెలిపారు.
ఈ వ్యవహారంపై అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, హ్యాకర్లను గుర్తించాలని కోరుతూ జమ్మూ కశ్మీర్ పోలీసులకు రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సైబర్ దాడి వెనుక ఎవరి హస్తం ఉన్నదీ ఇంతవరకు వెల్లడికాలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని జమ్ము అధికారులు పేర్కొన్నారు.
బెయిల్ పై ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎం : బీజేపీ కార్యదర్శి