ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సమాజానికి చేస్తున్న సేవ చాలా గొప్పదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్.. ఈ రోజు రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవలు అనిర్వచనీయమనీ అన్నారు. ఆ సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వేంకటేశ్వర్లు, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.