telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సంప్రదాయ ఆహారంలోనే పోషకాలు: గవర్నర్‌ తమిళిసై

Tamilisai Soundararajan governor

మన సంప్రదాయ ఆహారంలోనే పోషకాలు మెండుగా ఉన్నాయని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ తెలిపారు. హైదరాబాద్‌ తార్నాకలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నేషనల్‌ న్యూట్రిషన్‌ సర్వేను గవర్నర్‌ ప్రారంభించారు.

అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. సంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ ఆహారం తిన్న మన పూర్వీకులు ఎక్కువ కాలం జీవించారని ఆమె గుర్తు చేశారు. ఆరోగ్య భారత్‌ కోసం అనేక పోషకాహార పథకాలు అమల్లో ఉన్నాయని గవర్నర్‌ తెలిపారు.

Related posts