telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తమ ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి ఉంది: గవర్నర్

Republic Day Celebrations Hyderabad

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగా గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ తొలుత కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షించి ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి ఉందని స్ఫష్టం చేశారు.

తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవకతవకలకు తావు ఉండదని పేర్కొన్నారు. జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ టెండర్లలో అవినీతికి తావులేకుండా, లోపాయికారీ ఒప్పందాలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను ఈ కమిషన్ పరిశీలించి టెండర్లలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.

Related posts