telugu navyamedia
Uncategorized తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా బాధితులను రక్షించవచ్చు: గవర్నర్ తమిళిసై

governor tamilisai

ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్‌గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని మౌళిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన వారు ప్లాస్మాను డొనేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ప్లాస్మా డోనార్స్ ఈఎస్‌ఐ ఆస్పత్రికి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనార్ సంతోష్‌కు పుష్ప గుచ్ఛం ఇచ్చి గవర్నర్ అభినందించారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా భౌతిక దూరం పాటించినందుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని గవర్నర్ సూచించారు. ఎవరూ కరోనాతో చనిపోకూడదని, అదే తన లక్ష్యమని ఆమె అన్నారు.

Related posts