telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో గవర్నర్ పర్యటన రద్దు

biswabhusan harichandan governor

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. నేడు ఆయన ఇచ్చాపురం ప్రాంతంలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా అర్దాంతరంగా రద్దయింది. తొలుత ఈ నెల 20న గవర్నర్ పర్యటన ఉంటుందని ఆయన కార్యాలయం నుంచి కలెక్టరేట్, తహసీల్దారు కార్యాలయాలకు సమాచారం అందింది.

ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే, తన వ్యక్తిగత కారణాల వల్ల గవర్నర్, తన పర్యటనను రద్దు చేసుకున్నారని నిన్న అధికారులకు సమాచారం అందింది. నేడు గవర్నర్ ఒడిశా రాష్ట్రానికి వెళ్లనున్నారని, ఈ కారణంగానే పర్యటన రద్దయిందని సమాచారం.

Related posts