ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. నేడు ఆయన ఇచ్చాపురం ప్రాంతంలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా అర్దాంతరంగా రద్దయింది. తొలుత ఈ నెల 20న గవర్నర్ పర్యటన ఉంటుందని ఆయన కార్యాలయం నుంచి కలెక్టరేట్, తహసీల్దారు కార్యాలయాలకు సమాచారం అందింది.
ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే, తన వ్యక్తిగత కారణాల వల్ల గవర్నర్, తన పర్యటనను రద్దు చేసుకున్నారని నిన్న అధికారులకు సమాచారం అందింది. నేడు గవర్నర్ ఒడిశా రాష్ట్రానికి వెళ్లనున్నారని, ఈ కారణంగానే పర్యటన రద్దయిందని సమాచారం.
ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదు: యనమల