ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో మరికొన్నిరోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలోకి కొత్త అధికారులు వస్తున్నారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ స్థానంలో 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు. జగన్ ఏరికోరి సవాంగ్ ను పోలీస్ బాస్ గా తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ సవాంగ్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
సవాంగ్ చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన పోలీస్ కెరీర్ ప్రారంభించారు. ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001 నుంచి 2003 మధ్య వరంగల్ రేంజ్ డీఐజీగానూ వ్యవహరించారు. ఈ బాధ్యతలు చేపట్టకముందు హోంగార్డు విభాగం డీఐజీగా సేవలు అందించారు. 2003 నుంచి 2005 వరకు ఎస్ఐబీ, ఏపీఎస్పీ విభాగాల్లోనూ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. తిరిగి 2015లో గౌతమ్ సవాంగ్ విజయవాడ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించారు.
గవర్నర్తో అబద్దాలు చెప్పించారు: రాజాసింగ్