telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇద్దరు భామలతో రొమాన్స్‌ చేయనున్న గోపిచంద్‌ !

గోపిచంద్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో సినిమా తెరక్కనుంది. దీనికి ‘పక్కా కమర్షియల్‌’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనపించనున్నాడు. ఈ సినిమా జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. అయితే.. ఈ మధ్యే దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ వచ్చేసింది. అయితే.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చేసింది.  ఈ సినిమాలో గోపీచంద్ ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్నారు. వారిలో ఒకరు గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా, మరొకరు ఈషా రెబ్బ హీరోయిన్‌లుగా నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఈషా రెబ్బా పాత్ర ఎన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారంట. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబరు 1న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.

Related posts