telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

క్రాక్ రీమేక్ వారితోనే చేస్తా : గోపీచంద్

మాస్ మహరాజ్ వినిమ క్రాక్ భారీ వసూళ్లు చేసి సంక్రాంతి బరిలో విజయం సాధించాడు. అయితే ఈసినిమా ఊహించని స్థాయిలో వసూళ్లను చేసింది. విడుదల రోజున కాస్త ఆలస్యం అయినా చివరికి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలిన చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హిందీలో కూడా గోపీచంద్ మలినేని చేయనున్నాడు. కానీ ఇందులో హీరో ఎవరు చేస్తారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే దీని పై గోపీచంద్ క్లారిటీ ఇచ్చారు. తాను సినిమాకు బాలీవుడ్ హీరోల్లో ఇద్దరిని అనుకున్నారంట. వారిలో ఎవరో ఒకరినే సెలక్ట్ చేసుకుంటానని, వేరేవారితో చేయనని గోపీచంద్ ఫిక్స్ అయిపోయారు. ఆ హీరోలు బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్‌ అలాగే రణ్‌వీర్ సింగ్. మరి ఈ వీరిలో క్రాక్ సినిమాను హిందీలో ఎవరు చేస్తారన్నది తేలాల్సి ఉంది. అయితే బాలీవుడ్‌లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తెలుగులో పవర్ ఫుల్ మాస్ మసాలా సినిమాగా తెరకెక్కింది. అదే స్థాయిలో ప్రజాదరణ కూడా పొందింది. మరి ఈ సినిమా హిందీలో ఏమాత్రం ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Related posts