టాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్ లో అలాగే బాలీవుడ్ హిట్ సినిమాలు టాలీవుడ్లో రీమేక్ కావడం కొత్తేమి కాదు. త్వరలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ జిందా హై చిత్రం తెలుగులో రీమేక్ కానుందని అంటున్నారు. 2012లో వచ్చిన ఏక్ థా టైగర్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిన టైగర్ జిందా హై చిత్రాన్ని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించాడు. సల్మాన్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలో ఈ మూవీ ఉంది.
ఈ రీమేక్ చిత్రంలో సల్మాన్ పాత్రని గోపిచంద్ చేయనుండగా, కత్రినా పాత్రలో తమన్నా నటిస్తుందని అంటున్నారు. మరి ఈ మూవీని ఎవరు తెరకెక్కించనున్నారు, ఏ సంస్థ నిర్మిస్తుంది అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. గోపిచంద్ ప్రస్తుతం తిరు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుండగా, తమన్నా దటీజ్ మహాలక్ష్మీ అనే చిత్రంతో త్వరలో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది.