ప్రముఖ నటుడు, రచయిత, విలక్షణ నటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మధ్యాహ్నాం కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపుడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం 11.30ని.లకి చెన్నైలో జరపనున్నారు. అభిమానుల సందర్శనార్ధం శనివారం భౌతిక దేహాన్ని స్వగృహానికి తరలించనున్నారు. గొల్లపూడి మృతితో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుటుంబీకులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకు ఆసుపత్రిలోనే మృతదేహాన్ని ఉంచనున్నారు. గొల్లపూడికి ముగ్గురు కుమారులు ఉండగా, ఓ కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో మృతి చెందడంతో చాలా కుంగిపోయారు. దివంగత కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ పేరుమీద,…. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ప్రతి ఏట ఆగష్టు 12 న ,ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్ కి గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును ప్రదానం చేస్తుంది.
next post