దేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువ అవడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మళ్ళీ విదేశాల నుండి అక్రమ దిగుమతి జరుగుతుంది. దీనితో నిఘా వేసిన అధికారుల శ్రమ వృధా కాలేదు. తాజాగా, శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 1.8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న సుడాన్ దేశస్తుడిని ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద బంగారం బయటపడింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.