విజయవాడలో కొరియర్ ద్వారా పెద్ద మొత్తంలో బంగారం, వెండిని అక్రమంగా తరలిస్తున్న వైనం బయటపడింది. పక్కా సమాచారంతో తనిఖీ చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు కేజీ 77 గ్రాముల బంగారం, 40 కిలోల వెండి, రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా ముంబై నుంచి విజయవాడకు భారీగా బంగారం, వెండిని బట్వాడా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సొత్తు, డబ్బు హవాలా దందాగా గుర్తించారు. ఈ రాకెట్ వెనుక ఎవరున్నారో కూపీలాగుతున్నారు పోలీసులు.