కరోనా సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆ తరువాత దేశంలో మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ఈ ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధర నేడు మరలా పెరిగింది. అంతర్జాతీయంగా ఈ ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా ఈ దీపావళి రోజు బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 53,640 కి పెరిచిన్ది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 49, 270 వద్ద ముగిసింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.47,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ. 51,760కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 900 పెరిగి రూ.62,800కి చేరింది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 10 పెరిగింది. దీంతో వెండి ధర రూ.63,310కి చేరింది. దీపావళి అలాగే పెళ్లిళ్ల సీజన్ లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
previous post
మే 23న వైసీపీ దుకాణం బంద్: దేవినేని ఉమ