దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్ళి తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటికి స్వల్పంగా పెరిగినట్టు కనిపించినా, నేడు మళ్ళి భారీగా తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. బంగారం పెరిగితే, వెండి తగ్గటం.. వెండి పెరిగితే బంగారం తగ్గటం ప్రస్తుత మార్కెట్లో చూస్తున్నాం. అయితే నేడు హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గుదలతో రూ.39,710కు చేరింది. ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.50 తగ్గి రూ.36,380 వద్దకు చేరింది. బంగారం ధర తగ్గిన వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండి ధరలో రూ100 పెరుగుదలతో రూ.48,650కు చేరింది.
ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 పెరుగుదలతో రూ.38,400కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గుదలతో రూ.37,200కు క్షిణించింది. కాగా విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కాస్త పెరిగింది అనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లో 1,498.65 డాలర్ల పెరుగుదలతో ఔన్స 0.13 శాతం పెరిగింది. ఏది ఏమైనా ఈరోజు బంగారం ధర తగ్గడం పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది.
అమ్మ బయోపిక్ ను ఎవరు తీసినా అది సినిమానే… మేము చేసేది మాత్రం ఆమె జీవితం : నిత్యామీనన్