గ్లోబల్ మార్కెట్ లో బలిహీనమైన ట్రెండ్ తో ఉన్న జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో ధరపై ప్రతికూల ప్రభావం చూపడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధర భారీగా పడిపోయింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు తగ్గి 38,300 కు చేరింది. ఇంకా 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.50 తగ్గుదలతో రూ.37,100కు క్షీణించింది. పసిడి ధర పడిపోయిన వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో రూ.46,000కు చేరింది. కాగా హైదరాబాద్ మార్కెట్లో మాత్రం ఢిల్లీ మార్కెట్ కి బిన్నంగా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరుగుదలతో రూ.39,670కు చేరింది. 22 క్యారెట్ల(10 గ్రా) బంగారం ధర మాత్రం రూ.36,360 వద్దనే నిలకడగా ఉంది. ఇంకా హైదరాబాద్ వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. ఢిల్లీ మార్కెట్ లనే 350 రూపాయిలు పెరుగుదలతో 46,000 రూపాయలకు చేరింది. బంగారం పట్ల డిమాండ్ పెరగడం వల్లనే బంగారం ధర హైదరాబాద్ లో పెరిగింది అని నిపుణులు చెప్తున్నారు.
ఒకరోజు బంగారం భారీగా పెరిగితే మరో రోజు బంగారం ధరలు తగ్గుతూ, వ్యాపారస్తులను ఇబ్బందికి గురిచేస్తుంది. దీనికి కారణం భారీగా పెరిగిన సమయంలో ప్రజలు కొనకపోవడం వల్ల తగ్గుతుంటే స్వల్పంగా బంగారం తగ్గిన సమయంలో కొనడానికి ప్రజలు వెళ్లడం వల్లనే బంగారం ధరలు పెరుగుతున్నాయని, పెరిగిన కొద్ది రోజులు బంగారం కొనకుంటే బంగారం ధర భారీగా తగ్గుతుందని అంటున్నారు మార్కెట్ నిపుణులు.