దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో ప్రతి రోజు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ మహమ్మారి అన్ని రంగాలవారిని టచ్ చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయా శాఖల అధికారులు కరోనా భారీనపడ్డ విషయం తెలిసిందే.
తాజాగా గోవా ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జోస్ డిసాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ రోజు ఆయన యాంటిజెన్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆయన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ దవాఖానలో చేరినట్లు పేర్కొన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు విశేష కృషి చేస్తోంది. ఆరోగ్యశాఖ డైరెక్టర్ వైరస్ బారినపడటంతో ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందించారు. మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం . విఫలమైందన్నారు.
టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది: ఉత్తమ్