telugu navyamedia
క్రీడలు వార్తలు

ఉమెన్స్ ఐపీఎల్ : దుబాయ్ కి పయనమైన మహిళలు…

ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడిన పురుషుల ఐపీఎల్ సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ నవంబర్ 10న ముగుస్తుంది. అయితే బీసీసీఐ అధికారులు పురుషుల ఐపీఎల్ ముగిసే చివర అంటే నవంబర్ 4 నుండి 9 వరకు యూఏఈ వేదికగా మహిళల ఐపీఎల్ జరుగుతుంది బీసీసీఐ తెలిపింది. అయితే ఈ రోజు ఆ టోర్నీలో పాల్గొనడానికి ప్లేయర్స్ యూఏఈకి ఈ రోజు బయల్దేరారు. దానికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే గత ఐపీఎల్ సీజన్ లో కేవలం 3 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం 4 జట్లు ఉంటాయని బీసీసీఐ అధికారులు చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా 3 జట్లతోనే బీసీసీఐ మినీ ఐపీఎల్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే ఉంటాయి. మరి ఈ మినీ ఐపీఎల్ కోసం మహిళల యూఏఈ ప్రయాణం ఎప్పుడు అనేది తెలియదు. ఇక పురుషుల ఐపీఎల్ లో ఆటగాళ్లు ఏ విధమైన కరోనా నియమాలు పాటిస్తున్నారో మహిళల ఐపీఎల్ లో కూడా ప్లేయర్స్ అవే నియమాలు పాటించాలి.

Related posts