సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సోమవారం తెల్లవారుజామున రెండేళ్ల బాలిక కిడ్నాప్ కలకం రేపింది. నెల్లూరు జిల్లా కావలి మండలం రామన్నగరిపల్లి గ్రామానికి చెందిన డి. సురేశ్(25) తన కుమారుడు ప్రభాస్(5), కూతురు స్వర్ణలత(2)తో కలిసి ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చాడు. నెల్లూరుకు వెళ్లాల్సిన సురేశ్ ఆ రోజు రాత్రి అక్కడే తన పిల్లలతో కలిసి నిద్రించాడు.
అయితే సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో నిద్ర లేచి చూసేసరికి తన కూతురు కనిపించలేదు. స్టేషన్ మొత్తం వెతికినా స్వర్ణలత ఆచూకీ లభించలేదు. దీంతో రైల్వే పోలీసులకు సురేశ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. 25 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు.