మొబైల్స్ తయారీ కంపనీ జియోనీ అత్యాధునిక సాంకేతికతో ఓ నూతన స్మార్ట్వాచ్ను భారత్లో విడుదల చేసింది. స్మార్ట్లైఫ్ పేరిట ఇందులో 15 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్, 1.3 ఇంచుల డిస్ప్లే, గొరిల్లా గ్లాస్, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్, వుమెన్ హెల్త్ ఫీచర్, మ్యూజిక్ కంట్రోల్, ఫ్లాష్ లైట్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 4.4 అంతకు మించి, ఐఓఎస్ 8.0 అంతకు మించి ఓఎస్లు ఉన్న ఫోన్లకు ఈ వాచ్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. రూ.2,999 ధరకు ఈ వాచ్ను వినియోగదారులు ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు.