హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్టళ్ల పై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. మాదాపూర్లోని పలు ప్రైవేట్ హాస్టళ్లలో జీహెచ్ఎంసీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత, సెల్లార్లలో వంటగది నిర్వహిస్తున్న నాలుగు హాస్టళ్లకు రూ. 10 వేల చొప్పున జరిమానా విధించారు. ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
చందానగర్ సర్కిల్లోని మియాపూర్ జంక్షన్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఇటీవలే మున్సిపల్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. కస్టమర్లకు కుళ్లిన మాంసం సరఫరా చేయడం, పరిశుభ్రత పాటించకపోవడం వంటి హోటళ్లు, రెస్టారెంట్లను గుర్తించి భారీ జరిమానాలు విధించారు.
కేసీఆర్ బెదిరింపులతో అలీ వైసీపీలో చేరారు: బుద్ధా వెంకన్న