telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

వర్షం కురిసినప్పుడు ఐటీ ఉద్యోగులు..ఒకే సమయానికి బయటికి రావద్దు

software employees

హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురిసినప్పుడు ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా, ఒకే సమయానికి ఆఫీస్‌ల నుంచి బయటికి రావద్దని జీహెచ్ఎంసీ, సైబరాబాద్ కమిషనర్లు దాన కిషోర్, సజ్జనార్‌లు సూచించారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ పోలీస్ నేతృత్వంలో పలు శాఖల అధికారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వర్షం కురిసినప్పుడు వరద నీరు రోడ్లపై నిలువ వుండే ప్రాంతాలు, ట్రాఫిక్ జామ్ వంటి పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్, టీఎస్ఐఐసీ, ట్రాన్స్‌కో అధికారులతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్షం కురిసినప్పుడు ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా బయటికి రావద్దని అధికారులు సూచించారు. వర్షాకాలం మొత్తం అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

Related posts