telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్ వార్: మరికాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్

ghmc hydeerabad

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్‌ఎంసీ సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసారు. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేస్తారు. 1 హల్ కి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152. అలాగే 31 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు చేసారు. అయితే 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది. ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు. అయితే బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదయ్యింది.

Related posts