telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఘట్కేసర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి…

ఫార్మసీ విద్యార్థిని కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిపై కిడ్నాప్, రేప్‌, బెదిరింపులు, నిర్భయ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మత్తు మందు ఇచ్చి కారు లో నలుగురు రేప్ చేసారు. రేప్ చేసి హత్య చేయాలని ప్లాన్ చేశారు. నగరం లోని రాంపల్లి చౌరస్తా దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ అనంతరం లైంగిక దాడి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు.. గతంలో కూడా అనేక నేరాలకు పాల్పడ్డట్టు విచారణలో బయట పడింది.. అత్యాచారం తర్వాత ఆమెను అంతమొందించాలని భావించిన నిందితులు.. పోలీసుల సైరన్ తో చెట్ల పొదల్లో నుండి పరారయ్యారు. గతంలో కూడా కొంత మంది మహిళలపై ఇదే తీరుగా ప్రవర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కుటుంబ సభ్యులు దగ్గర నుంచి వివరాలు సేకరించిన పోలీసులు నేడు మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టనున్నారు.

Related posts