భారత మార్కెట్లోకి జెమోపై సంస్థ ‘ఆస్ట్రీడ్ లైట్’ స్కూటర్ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.79,999గా నిర్ణయించింది. ఐదు రంగుల్లో లభించే ఈ స్కూటర్ అక్టోబర్ తొలి వారం నుంచి ఇది కొనుగోలుదారులకు లభ్యం అవుతుందని జెమోపై ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు అమిత్ రాజ్ సింగ్ పేర్కొన్నారు.
స్పోర్ట్స్, సిటీ, ఎకానమీ లాంటి మూడు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ ఒక్క సారి ఛార్జీంగ్ చేస్తే 75-90 కిలోమీటర్లు ప్రయాణించ్చని తెలిపారు. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చని తెలిపారు.